News April 13, 2025
విశాఖ మీదుగా వెళ్లే రైళ్ల దారి మళ్లింపు

ఖుర్దా డివిజన్లో ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ ఆదివారం తెలిపారు. ఈనెల16 నుంచి 23వరకు విశాఖ -హిరకుడ్(20807/08), భువనేశ్వర్ – LTT (12879/80), (22865/66), (20471/72), (20823/24), (22827/28), (20861/62) నంబర్ గల రైళ్లు విజయనగరం, తిట్లాఘర్, సంబల్పూర్ మీదుగా ఝార్సుగూడ చేరుకుంటాయన్నారు.
Similar News
News April 16, 2025
భీమిలి: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

విశాఖలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. షిప్పింగ్ యార్డ్ ప్రాంతానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలోని ఓ కాలేజీ ఎదురుగా ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళ స్టేషన్ ఏసీపీ పెంటా రావు సంఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించారు.
News April 16, 2025
విశాఖ: దివీస్ ఉద్యోగి మృతి

దివీస్లో పనిచేస్తున్న మధు మోహాన్ మంగళవారం మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన మోహన్ దివీస్లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్కి వచ్చాడు. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 16, 2025
కైలాసపట్నం: క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్లో చికిత్స పొందుతున్న జల్లూరి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకల జానకిరామ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు మంగళవారం తెలిపారు. వి.సంతోషి, వి షారోని, వి.రాజును త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.