News April 13, 2025
విశాఖ మీదుగా వెళ్లే రైళ్ల దారి మళ్లింపు

ఖుర్దా డివిజన్లో ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ ఆదివారం తెలిపారు. ఈనెల16 నుంచి 23వరకు విశాఖ -హిరకుడ్(20807/08), భువనేశ్వర్ – LTT (12879/80), (22865/66), (20471/72), (20823/24), (22827/28), (20861/62) నంబర్ గల రైళ్లు విజయనగరం, తిట్లాఘర్, సంబల్పూర్ మీదుగా ఝార్సుగూడ చేరుకుంటాయన్నారు.
Similar News
News November 18, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 135 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్కు సోమవారం 135 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News November 18, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 135 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్కు సోమవారం 135 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News November 18, 2025
ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.


