News March 21, 2025
విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు: మంత్రి

విశాఖ ప్రజాప్రతినిధులతో పట్టణాభివృద్ధిశాఖా మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. వీఎంఆర్డీఏ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. విశాఖ మెట్రోకు మే నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
Similar News
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ఇంటి వద్దే వారికి ఓటు హక్కు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దివ్యాంగులు, వృద్ధులకు ఎన్నికల కమిషన్ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకు ఓటర్లు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 102 మంది వృద్ధులు, దివ్యాంగులు దీనికోసం అప్లై చేసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఈసీ ఈ చర్యలు చేపట్టింది.
News October 28, 2025
వరంగల్: రూ.25 తగ్గిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మళ్లీ తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,925 పలకగా.. నేడు రూ.25 తగ్గి, రూ. 6,900 కి చేరింది. పత్తి ధరలు క్రమంగా తగ్గుతుండడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించిన విషయం తెలిసిందే.
News October 28, 2025
వనపర్తి జిల్లాలో అక్కడే అధిక వర్షపాతం

వనపర్తి జిల్లాలో 21 వర్షపాత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వెలుగొండలో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దగడలో 8.5, జానంపేట 4.5, శ్రీరంగపురం 3.0, ఏదుల 2.8, పెబ్బేరు 2.5, రేమద్దుల, కేతేపల్లి, గోపాల్పేట, రేవల్లిలో 1.8, సోలిపూర్, పానగల్ 1.5, పెద్దమందడి 1.3, కానాయిపల్లి 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.


