News May 2, 2024
విశాఖ: మే 5న సమీకృత ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సెల్ఫ్ సపోర్ట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మే 5వ తేదీన నిర్వహిస్తునట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డీఏ నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 11:30 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలన్నారు.
Similar News
News November 21, 2025
విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.
News November 21, 2025
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.
News November 21, 2025
విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.


