News July 28, 2024

విశాఖ: యాక్సిడెంట్‌లో ఫార్మా ఉద్యోగి మృతి

image

ఆనందపురం మండలం దుక్కవానిపాలెం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి ఉప్పల రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది బాపట్ల జిల్లా వేమూరు మండలం బుతమల్లి గ్రామం. 2002 నుంచి దివీస్ కంపెనీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. గాజువాక స్టీల్ లోడ్ తీసుకొని వెళ్లివస్తూ టోల్ ప్లాజా వద్ద మంచినీటి కోసం ఆగి రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొని మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 22, 2025

విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

image

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్‌లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.

News October 22, 2025

గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

image

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి,ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి పీఎంపాలెం వెళ్లారు.

News October 22, 2025

విశాఖలో రూ.7,62,892 విలువ గల బాణసంచా సీజ్

image

విశాఖలో దీపావళి వేడుకల్లో 3 సంవత్సరాల కంటే చాలా తక్కవ వాయుకాలుష్యం నమోదు అయ్యింది. సీపీ ఆదేశాలతో పోలీసులు దాడులు జరిపి 39 కేసులు నమోదు చేసి, రూ.7,62,892 విలువ గల నకిలీ మందుగుండు సామగ్రి, లైసెన్స్ లేని బాణసంచా సామగ్రి సీజ్ చేశారు. ఈ సంవత్సరం దీపావళి తర్వాత, 3 మూడు సంవత్సరాల కంటే తక్కువగా నగరంలో వాయుకాలుష్యం నమోదు అయిందని విశాఖ పోలీసులు బుధవారం తెలిపారు.