News October 29, 2024
విశాఖ: రంజీ మ్యాచ్లో ఆంధ్రా టీం ఓటమి

విశాఖలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్ టీం 38 పరుగుల తేడాతో ఆంధ్రా జట్టుపై విజయం సాధించింది. 158 ఓవర్లలో 500 పరుగులు చేసిన హిమాచల్ప్రదేశ్ జట్టు 156 పరుగులు ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రిషి ఆర్ ధావన్ 318 బంతుల్లో 19 ఫోర్లు, రెండు సిక్సులతో 195 పరుగులతో నాట్ అవుట్గా నిలిచారు. అనంతరం ఆంధ్ర జట్టు 32.1 ఓవర్లలో 118కి ఆలౌట్ అయ్యి 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Similar News
News December 27, 2025
భీమిలికి పెరుగుతున్న వలసలు?

విశాఖ తీరానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే, వలసదారులు అక్కడే వాలుతున్నాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, IT పురోగతి పెరగడం మైగ్రేషన్ను పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో 1,2 స్థానాల్లో భీమిలి, గాజువాకలు నిలిచాయి.ప్రస్తుతం భీమిలిలో 3,66,256 మంది ఓటర్లు ఉన్నారు. భీమిలి నియోజకవర్గంలో సగం అర్బన్, సగం గ్రామీణ వాతావరణం ఉంటుంది.
News December 27, 2025
‘ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను జీవీఎంసీ వెబ్ పోర్టల్ నందు చెల్లించండి’

జీవీఎంసీ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను జీవీఎంసీ యొక్క www. gvmc.gov.in వెబ్సైట్ నందు సులభంగా చేసుకోవచ్చని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి శనివారం తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లించుకోవచ్చు అన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని విలువైన సమయం వృథా కాకుండా పన్నులు చెల్లింపు చేయవచ్చు పేర్కొన్నారు.
News December 27, 2025
అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్కు తాత్కాలిక హల్ట్

విశాఖ నుంచి లింగంపల్లి (12805/12806) వెళ్లే, లింగంపల్లి విశాఖ వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్కు అనపర్తి రైల్వే స్టేషన్లో తాత్కాలిక హల్ట్ కల్పించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం పవన్ శనివారం తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు జనవరి 6 నుంచి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు విషయాన్ని గమనించాలన్నారు.


