News March 23, 2025
విశాఖ రానున్న మంత్రి కందుల దుర్గేష్

ఏపీ రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం విశాఖ రానున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు రుషికొండ బీచ్ ప్రాంతానికి వస్తారు. అనంతరం ఋషికొండ దగ్గర బ్లూ ఫ్లాగ్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి విశాఖ సర్క్యూట్ హౌస్కి వెళ్లి ముఖ్య నాయకులతో సమావేశమై సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి గన్నవరం వెళ్లనున్నారు.
Similar News
News November 14, 2025
లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించండి: DMHO

ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించాలని DMHO జగదీశ్వరరావు అన్నారు. తరచుగా మూత్ర విసర్జన, మానసిక స్థితిలో, కళ్ల దృష్టిలో మార్పు, బరువు తగ్గడం,బలహీనతగా ఉండటం, ఎక్కువగా దాహం కలగడం వంటి లక్షణాల ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గరలో ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకోవాలన్నారు.
News November 14, 2025
బీహార్ విజయంపై ఎన్డీయే నేతల సెలబ్రేషన్స్

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయాన్ని పురస్కరించుకుని విశాఖలో సీఎం చంద్రబాబు కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎంపీలు పరస్పరం స్వీట్లు తినిపించుకొని ఆనందం పంచుకున్నారు.
News November 14, 2025
మూడేళ్లలో విశాఖలో లూలూ మాల్

మూడేళ్లలో విశాఖలో ‘లూలూ’ మాల్ను పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ తెలిపారు. CII సమ్మిట్లో ఆయన మాట్లాడారు. 2018లో మాల్కు శంకుస్థాపన చేశామన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పలు కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.


