News March 23, 2025

విశాఖ రానున్న మంత్రి కందుల దుర్గేష్

image

ఏపీ రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం విశాఖ రానున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు రుషికొండ బీచ్ ప్రాంతానికి వస్తారు. అనంతరం ఋషికొండ దగ్గర బ్లూ ఫ్లాగ్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి విశాఖ సర్క్యూట్ హౌస్‌కి వెళ్లి ముఖ్య నాయకులతో సమావేశమై సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి గన్నవరం వెళ్లనున్నారు.

Similar News

News April 24, 2025

ఈనెల 26న GVMC డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

image

GVMC డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఈనెల 26న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈనెల 26న ఉదయం 11 గంటలకు GVMC కౌన్సిల్ హల్లో నిర్వహించనున్నారు. ఆరోజున సమావేశానికి హాజరవుతున్న సభ్యులు మొబైల్ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాలన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్లు, కార్పొరేటర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

News April 24, 2025

ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పే ఔత్సాహికుల‌కు పూర్తి స‌హ‌కారం: కలెక్టర్

image

ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేందుకు ముందుకు వ‌చ్చే పారిశ్రామిక ఔత్సాహికుల‌కు అన్ని విధాలుగా పూర్తి స‌హ‌కారం అందించాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాల‌కు, ప‌రిశ్ర‌మ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన నీటి వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చాల‌న్నారు. భూ సేక‌ర‌ణ‌, సింగిల్ విండో క్లియ‌రెన్స్ అంశాల్లో వేగం పెంచాల‌ని ఆదేశించారు.

News April 24, 2025

దువ్వాడ మీదగా చర్లపల్లి, సంబల్ పూర్‌కు ప్రత్యేక రైళ్లు

image

వేసవి రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదగా చర్లపల్లి, సంబల్ పూర్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. విశాఖ -చర్లపల్లి (08579/80), ఈనెల 25 నుంచి మే 30 వరకు, సంబల్ – ఈ రోడ్డు (08311) మే 7 నుంచి జూన్ 25 వరకు ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

error: Content is protected !!