News December 13, 2024
విశాఖ: ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి’
విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వచ్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. గురువారం దీనిపై విశాఖ ఎంపీ శ్రీభరత్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రూ.14,309 కోట్ల ప్రతిపాదనలతో సమగ్ర మొబిలిటీ ప్లాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్లాన్ సరిగా లేకపోవడంతో మళ్లీ పంపించాలని కోరామన్నారు.
Similar News
News January 18, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లాప్టాప్, రెండు మొబైల్స్, 80 బ్యాంకు అకౌంటులను స్వాధీనం చేసుకొని వాటిలో రూ.140కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లావాదేవీలకు సహకరించిన నలుగురుని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.
News January 18, 2025
విశాఖ: నేడు స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్.. కలెక్టర్ సూచనలు
స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం భాగస్వామ్యం కావాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని, గార్బేజ్ క్లీనింగ్, టాయిలెట్స్ క్లీనింగ్ చేయాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించాలని సూచించారు.
News January 17, 2025
భీమిలి: కాకరకాయ జ్యూస్ అనుకుని పురుగుమందు తాగి మృతి
భీమిలి ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న <<15172608>>ముస్తఫా<<>> ఈనెల15న ఉదయం కాకరకాయ జ్యూస్ అని భావించి పురుగుమందు తాగడంతో మృతి చెందాడు. తనకు షుగర్ వ్యాధి ఉండడంతో రోజు కాకరకాయ జ్యూస్ తాగుతాడు.14న మొక్కలకి పిచికారి చేసేందుకు పురుగుల మందు తీసుకువచ్చి గ్లాస్లో ఉంచాడు. ఆ విషయం మర్చిపోయి పురుగుల మందు తాగాడు. భార్య ఫాతిమా పురుగుల మందు ఏదని ప్రశ్నించడంతో తాగింది పురుగుమందు అని తెలిసింది.