News November 16, 2024
విశాఖ: రూ.65 కోట్ల విలువ కలిగిన భూమి స్వాధీనం

సీతమ్మధార ప్రాంతంలో ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న రూ.65 కోట్ల విలువ గల 10 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానం అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ 10 ఎకరాల భూమితో పాటు మరో 4,460 చదరపు గజాల భూమికి సంబంధించి ఆక్రమణదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో ఈఓ త్రినాథరావు, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి దేవస్థానానికి చెందిన భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
Similar News
News March 16, 2026
విశాఖ: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు 397 వినతులు

పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై సాధారణ పీజీఆర్ఎస్కు 397 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ క్లినిక్కు 119, జీవీఎంసీకి చెందినవి 94, పోలీసు 26, ఇతర శాఖలకు సంబంధించినవి 158 వినతులు ఉన్నాయి.
News March 16, 2026
పద్మనాభంలో భారీగా కోడిపందాలు.. 73 మంది పట్టివేత

పద్మనాభ మండలం శివారు ప్రాంతం రాయల్ గార్డెన్స్లో అర్ధరాత్రి కోడిపందాలు నిర్వహిస్తుండగా సిటీ టాస్క్ఫోర్స్ పద్మనాభం పోలీసులు పట్టుకున్నారు. కోడిపందాలు నిర్వహణ ప్రాంతంలో 73 మందిని అదుపులోకి తీసుకోగా 7,56,000 నగదు, ఎనిమిది కారులు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహించడం స్థానికంగా సంచలమైంది.
News March 16, 2026
నేటి నుంచి ఒంటి పూట బడులు: డిఈవో

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


