News March 2, 2025
విశాఖ రేంజ్లో ఎస్ఐలుగా బావ బామ్మర్ది..!

విశాఖ రేంజ్లో బావ బామ్మర్దులు ఎస్లుగా రిపోర్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం పి.పొన్నవోలుకి చెందిన పులఖండం నాని, కొరసాల దుర్గాప్రసాద్ ఎస్ఐలుగా ఎంపికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన వీరు వరుసకు బావమరుదులు అవుతారు. అనంతపురంలో 52 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న వీరిద్దరూ ఆదివారం విశాఖ రేంజ్లో రిపోర్ట్ చేశారు. ఇద్దరూ ఒకేసారి ఎంపికవ్వడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 2, 2025
రేపటి నుంచి సింహాచలం నృసింహ దీక్షలు ప్రారంభం

సింహాచలంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి నృసింహ దీక్షలు ప్రారంభం కానున్నట్లు ఈవో సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ దీక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత దీక్షలు డిసెంబర్ 3 నుంచి, రెండో విడత దీక్షలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పై తేదీలలో మాల ధరించే భక్తులకు తులసి మాలలు, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
News December 2, 2025
రేపటి నుంచి సింహాచలం నృసింహ దీక్షలు ప్రారంభం

సింహాచలంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి నృసింహ దీక్షలు ప్రారంభం కానున్నట్లు ఈవో సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ దీక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత దీక్షలు డిసెంబర్ 3 నుంచి, రెండో విడత దీక్షలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పై తేదీలలో మాల ధరించే భక్తులకు తులసి మాలలు, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
News December 2, 2025
విశాఖ: ‘మా కొడుకును కోడలే చంపింది’

విశాఖలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే కోడలే తమ కొడుకుని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిశోర్ తల్లి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


