News August 6, 2024

విశాఖ: రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో కోర్బా రైలులో జరిగిన అగ్ని ప్రమాదంపై తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం విశాఖ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బృందంలో నిపుణులు రైల్వే స్టేషన్‌తో పాటు అగ్నిప్రమాదంలో దగ్దమైన బీ7 భోగి, పాక్షికంగా కాలిన బీ6 భోగిని పరిశీలించారు. దర్యాప్తులో పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్న బృందం అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతుంది.

Similar News

News December 18, 2025

విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు: కలెక్టర్

image

విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, కాలుష్య కారకాలను గుర్తించి వాటి తీవ్రత తగ్గించేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

News December 18, 2025

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఇన్‌ఛార్జ్ సీఎండీగా గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 18, 2025

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఇన్‌ఛార్జ్ సీఎండీగా గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.