News November 27, 2024
విశాఖ: రైల్వేస్ జట్టుపై గెలుపొందిన చత్తీస్గఢ్

సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 క్రికెట్ ట్రోఫీలో భాగంగా విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో రైల్వేస్ జట్టుపై చతీస్గఢ్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ దిగిన రైల్వేస్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చతీస్గఢ్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.
Similar News
News January 9, 2026
ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.
News January 9, 2026
ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.
News January 8, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుడి మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్లోని ఫ్రెండ్స్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.


