News January 22, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

image

అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు భార్యాభర్తలని పోలీసులు తెలిపారు. ఫార్మాసిటీలో విధులు నిర్వహిస్తున్న మన్మధరావు తన భార్య అరుణ్ కుమారీతో కలిసి అగనంపూడి వద్ద డొంకాడ గ్రామంలో అద్దెకు ఉంటున్నట్లు సీఐ వివరాలు వెల్లడించారు. బ్యాంకు పనినిమిత్తం బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని సీఐ తెలిపారు.

Similar News

News October 31, 2025

విశాఖ: బెట్టింగ్ యాప్.. మరో ఇద్దరి అరెస్ట్

image

బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్‌లు నడుపుతున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News October 31, 2025

గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారులు పూర్తి చేయాలి: VMRDA ఛైర్మన్

image

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారుల పనులను గడువులోగా పూర్తి చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్‌లోని 7 రహదారుల పురోగతిని ప్రతి 15 రోజులకు సమీక్షించనున్నట్లు తెలిపారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్, వుడా పార్క్‌లో స్కేట్ బోర్డ్ పనులు కూడా సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.

News October 30, 2025

విశాఖ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

image

రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం రవాణా శాఖ అధికారులు విశాఖలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 36 వాహనాలను తనిఖీ చేశారు. రహదారి నియమాలు పాటించకుండ, పర్మిట్ నియమాలను అతిక్రమించి తిరుగుతున్న ఒక బస్సుపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో టాక్స్, పెనాల్టీ రూపేణా 2,45,000 వసులు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.