News May 3, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

image

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో HSL కాంప్లెక్స్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి దుర్మరణం చెందాడు. వీరు ముగ్గురు కొమ్మాదిలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ దాశరథి తెలిపారు.

Similar News

News November 21, 2025

విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

image

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

News November 21, 2025

నేడు గ్రేటర్‌ విశాఖ కౌన్సిల్ సమావేశం

image

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం జరగనుండగా ఈ సమావేశంలో చర్చించేందుకు మొత్తం 90 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. వీటిలో ప్రధానంగా నగరంలోని వివిధ వార్డుల అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్‌సప్లై వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ముందస్తు వ్యూహరచనలో భాగంగా వైసీపీ తరఫున షాడో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారు. సమావేశం ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News November 21, 2025

నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

image

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.