News September 1, 2024
విశాఖ: వాహన చోదకులు తస్మాత్ జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక

వాహన చోదకులారా.. తస్మాత్ జాగ్రత్త.. నిబంధనలు పాటించండి, రోడ్డు ప్రమాదాలు నియంత్రించండి అంటూ సిటీ పోలీస్లు అప్రమత్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి గానీ, వెనుక కూర్చున్న వ్యక్తి గానీ, వాహనంపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు BIS మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలి. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ ధరించవలెను.
Similar News
News February 8, 2025
T -10 దివ్యాంగ్ ప్రీమియర్ లీగ్లో ఆడనున్న గాజువాక కుర్రాడు

అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని గాజువాక కుంచుమాంబ కాలనీకి చెందిన బి.మణికంఠ నిరూపించారు. క్రీడల్లో విశేషంగా రాణిస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన దివ్యాంగ క్రికెట్ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందారు. తన టాలెంట్తో ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ నెల 16, 17,18 తేదీల్లో వారణాసిలో జరిగే T-10 దివ్యాంగ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యారు.
News February 8, 2025
విశాఖ: కాలేజీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

పద్మనాభం మండలం పొట్నూరు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయనగరం నుంచి సైకిల్ పై స్వగ్రామం పొట్నూరు వస్తున్న పరదేశి(48)ని కాలేజీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఫిట్టర్గా పని చేస్తున్నాడు. విధులకు హాజరు కావడానికి సైకిల్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 8, 2025
కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 10, 22 తేదీలలో రాత్రి 10.20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 13, 25 తేదీలలో సాయంత్రం 5:45కు గోరఖ్పూర్లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.