News December 11, 2024
విశాఖ: విజయవంతమైన వెల్ డెక్ రికవరీ ట్రయల్స్

విశాఖ తీరంలో నిర్వహించిన వెల్ డెక్ రికవరీ ట్రయల్స్ విజయవంతమైనట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. నావికాదళం సహకారంతో ఈనెల 6వ తేదీన గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ విధులు ముగించుకుని క్రూ మాడ్యూల్లోనే భూమిపైకి తిరిగి వస్తారు. వీటిని సముద్రంలోకి పడేటట్లు చేస్తారు. అక్కడనుంచి వ్యోమగాములు సురక్షితంగా వస్తారు.
Similar News
News March 11, 2025
ఇనాం భూముల సమస్యలు పరిష్కరించండి: గంటా

ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కోరారు. ఆ భూములపై యాజమన్య హక్కులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉన్నా సరే పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యే మార్గంగా సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు.
News March 11, 2025
హయగ్రీవ భూములలో బోర్డులు పాతిన అధికారులు

ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్కు కేటాయించిన 12 ఎకరాల 51 సెంట్ల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వృద్ధులకు ఓల్డేజ్ హోం నిర్మాణం పేరుతో తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు విచారణలో తేలింది. దీంతో వెంటనే ఈ భూమి స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ఆ భూమిలో బోర్డులు పాతారు.
News March 11, 2025
విశాఖలోని 13 రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు.(రూ/కేజీలలో) టమాటా కేజీ రూ.13, ఉల్లి రూ.27, బంగాళాదుంప రూ.15, నల్లవంకాయలు రూ.30, బెండకాయలు రూ.42, మిర్చి రూ.32, దొండ రూ.38, బరబాటి రూ.38, క్యారెట్ రూ.30/38, వెల్లుల్లి రూ.90/100గా, బీట్ రూట్ రూ.24, కీరా రూ.22, గ్రీన్ పీస్ రూ.50, పెన్సిల్ బీన్స్ రూ.50, కాకర కాయ రూ.44, పొటల్స్ రూ.90, చేమదుంప రూ.34గా నిర్ణయించారు.