News April 2, 2024

విశాఖ: విద్యార్థిని మృతి కేసులో ఐదుగురు అరెస్టు

image

కొమ్మాదిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 28న విద్యార్థిని మృతి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్.శంకర్రావు, మేనేజ్మెంట్ సిబ్బంది శంకర్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ జి.భాను ప్రకాష్, హాస్టల్ వార్డెన్ వి.ఉషారాణి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.

Similar News

News April 11, 2026

విశాఖ-సికింద్రాబాద్‌ రూట్ టాప్ రద్దీ మార్గం..

image

విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. 2025-26లో ఈ రూట్‌లో 48 లక్షల మంది ప్రయాణించడంతో దక్షిణాదిలో టాప్ రద్దీ మార్గంగా నిలిచింది. వేగం, సౌకర్యం, సమయపాలనతో ప్రయాణికులు ఈ రైలును ఎక్కువగా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులకు ఇది కీలకంగా మారింది. ఈ కనెక్టివిటీతో 2 నగరాల మధ్య ఆర్థిక, సామాజిక అనుబంధం మరింత బలపడుతోంది.

News April 11, 2026

విశాఖ: ఏప్రిల్ 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఈనెల 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా జరుగుతాయన్నారు. సభ్యులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.

News April 11, 2026

విశాఖ: ఏప్రిల్ 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఈనెల 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా జరుగుతాయన్నారు. సభ్యులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.