News October 10, 2024

విశాఖ వేదికగా మలబార్ విన్యాసాలు

image

విశాఖ వేదికగా జరుగుతున్న మలబార్-2024 విన్యాసాల ప్రారంభ వేడుకల్లో నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాల అధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో సవాళ్లను పరిష్కరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.

Similar News

News October 10, 2024

మిల్లెట్స్‌తో రతన్ టాటా చిత్రపటం

image

దాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, భారతదేశానికి, పారిశ్రామిక రంగానికి పేరు ప్రఖ్యాతి తెచ్చిన మహోన్నత వ్యక్తికి విశాఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. మిలెట్స్ ఉపయోగించి రతన్ టాటా చిత్రాన్ని తయారు చేశారు. ఆ మహనీయునికి తాను ఇచ్చే నివాళి ఇది అని విజయ్ కుమార్ అన్నారు.

News October 10, 2024

విశాఖ: ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ప్రాధాన్యతను వివరించిన టాటా

image

ఇంటర్ డిసిప్లినరీ రీసర్చ్ జరపాల్సిన అవసరం ఉందని రతన్ టాటా అన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 2018 డిసెంబర్ 10న నిర్వహించిన పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏయూతో పరిశోధన రంగంలో కలసి పనిచేయడానికి, సంయుక్త పరిశోధనలు జరిపే దిశగా యోచన చేస్తామన్నారు. విభిన్న శాస్త్రాలను సమన్వయం చేస్తూ పరిశోధనలు జరపాలన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్నవారితో గ్రూప్ ఫొటో తీసుకున్నారు.

News October 10, 2024

విశాఖ: నిన్న గుడ్‌న్యూస్.. అంతలోనే..!

image

తమ కంపెనీ సేవలను విశాఖలో విస్తరించనున్నట్లు టీసీఎస్ ప్రతినిధులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 10 వేల మందికి ఉపాధిని కల్పిస్తామని వెల్లడించింది. విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి టాటా గ్రూప్ చేయూతనిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. నిన్న అధికారిక ప్రకటన రాగా.. ఈరోజు ఆ సంస్థ అధినేత రతన్ టాటా మృతి వార్త విశాఖ వాసులను కలచివేసింది. కాగా.. 2018 డిసెంబర్ 10న చివరిసారిగా రతన్ టాటా విశాఖలో పర్యటించారు.