News June 28, 2024
విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఆటగాళ్ల సందడి
విశాఖ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్లో క్రికెటర్లు శుక్రవారం సందడి చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ మూడో సీజన్ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు తలబడనున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు.
Similar News
News September 21, 2024
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరట
విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది.
News September 21, 2024
విశాఖ: 51 మంది వీఆర్వోలకు బదిలీలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడ్-2 వీఆర్వోలకు విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల కోసం మొత్తం 234 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 51 మందికి బదిలీలు నిర్వహించినట్లు డీఆర్ఓ తెలిపారు.
News September 21, 2024
ఎస్.రాయవరంలో గురజాడ జయంతికి ఏర్పాట్లు
మహాకవి గురజాడ వేంకట అప్పారావు జయంతి నిర్వహించేందుకు ఆయన జన్మస్థలమైన ఎస్.రాయవరం గ్రామంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న గురజాడ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. ఈ సందర్భంగా గ్రామంలో శుక్రవారం, శనివారం గురజాడ జయంతి వేడుకలు జరుపుతామని గురజాడ ఫౌండేషన్ సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు తెలిపారు.