News July 16, 2024
విశాఖ: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కు టోల్ ఫ్రీ

నూతనంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావలసిన వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 కు ఫోన్ చేసి సర్వీసు పొందవచ్చునని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు కనెక్షన్ల కోసం ఈ నంబర్కి ఫోన్ చేయవచ్చునని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News October 16, 2025
విశాఖలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

షీలానగర్-సబ్బవరం గ్రీన్ఫీల్డ్ హైవే విస్తరణతో విశాఖలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. షీలానగర్ నుంచి సబ్బవరం నేషనల్ హైవేకి 13KM మేర సిక్స్ లేన్ రోడ్డు వేయనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.964 కోట్లు మంజూరు చేయగా.. PM మోదీ నేడు కర్నూలు జిల్లా నుంచి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి పూర్తయితే విశాఖ పోర్టు నుంచి కార్గో నగరంలోకి రాదు. గాజువాక, విమానాశ్రయం వైపు వెళ్లే వారి ప్రయాణం సుగమం అవుతుంది.
News October 15, 2025
610 క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ: జీవీఎంసీ సీఎంవో

ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని జీవీఎంసీ సీఎంవో నరేష్ కుమార్ కోరారు. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నామన్నారు. దీన్ని 100% నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 610 క్లాప్ వాహనాలు, 65 ఇ-ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.
News October 15, 2025
నిర్ధిష్ట సమయంలో రోడ్ల నిర్మాణం: వీఎంఆర్డీఏ ఛైర్మన్

మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. అర్హులైన వారికి టీడీఆర్ ఇవ్వాలన్నారు. సమస్యలు లేని చోట్ల రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే <<18005420>>రోడ్డు నిర్మాణం<<>> వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేశ్, సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.