News July 16, 2024

విశాఖ: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు టోల్ ఫ్రీ

image

నూతనంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావలసిన వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 కు ఫోన్ చేసి సర్వీసు పొందవచ్చునని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు కనెక్షన్‌ల కోసం ఈ నంబర్‌కి ఫోన్ చేయవచ్చునని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News November 18, 2025

సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

image

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 18, 2025

సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

image

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 18, 2025

కంచరపాలెంలో 21న జాబ్ మేళా

image

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నై‌లో పనిచేయాల్సి ఉంది.