News July 5, 2024
విశాఖ: సచివాలయ సేవల్లో జాప్యం..?

గ్రామ సచివాలయానికి సంబంధించిన సేవల్లో గత వారం రోజులుగా జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు అంటున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ వివిధ సర్టిఫికెట్ల జారీ, దరఖాస్తులు చేసుకునే ప్రక్రియలు సిబ్బంది నిలిపి వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అదే సమయంలో భూములకు సంబంధించిన మ్యుటేషన్ సంబంధించిన పనులు కూడా జరగడం లేదని సమాచారం.
Similar News
News October 18, 2025
ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అంటారేమో: విష్ణుకుమార్ రాజు

వైసీపీ స్థితిని చూస్తే బాధ కలుగుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రెండు ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అనే స్థాయికి దిగిపోయిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్నారు. అదానీకి భూములు ధారాదత్తం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా 2వేల ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతారని వెల్లడించారు.
News October 18, 2025
గాజువాక: టిప్పర్ బీభత్సం.. మహిళ మృతి

గాజువాక సమతా నగర్లో దారుణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం భారీ టిప్పర్ రోడ్డు పక్కన కొబ్బరిబోండాలు అమ్ముతున్న వియ్యపు అప్పయ్యమ్మపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న బాలుడికి గాయాలు అయ్యాయి. న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిద్రమత్తులో వాహనం నడపడం వలనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
News October 17, 2025
విశాఖ డీఆర్వో Vs ఆర్డీవో

విశాఖ DRO భవానీ శంకర్, RDO శ్రీలేఖ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. డీఆర్వోపై కలెక్టర్కు ఆర్డీవో ఇటీవల లేఖ రాయగా.. రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. పచారీ సరుకుల కోసం తహశీల్దార్లకు ఇండెంట్లు పెడుతున్నారన్న RDOఆరోపణలపై ‘అవగాహన లేని అధికారి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని’ DRO అన్నారు. కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.