News July 5, 2024
విశాఖ: సచివాలయ సేవల్లో జాప్యం..?

గ్రామ సచివాలయానికి సంబంధించిన సేవల్లో గత వారం రోజులుగా జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు అంటున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ వివిధ సర్టిఫికెట్ల జారీ, దరఖాస్తులు చేసుకునే ప్రక్రియలు సిబ్బంది నిలిపి వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అదే సమయంలో భూములకు సంబంధించిన మ్యుటేషన్ సంబంధించిన పనులు కూడా జరగడం లేదని సమాచారం.
Similar News
News February 27, 2026
45 కేసులు ఛేదన.. 76 మంది అరెస్టు: సీపీ

గడిచిన జనవరి నెలలో 69 ఆస్తి నేరాలు జరిగాయని 45 కేసులు గుర్తించి 76 మందిని అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి తెలిపారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల ప్రాపర్టీ మేళ నిర్వహించగా రూ.39.79 లక్షలు, 420 పోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 63 లక్షలు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు నగరంలో రూ. 13.94 కోట్లు విలువైన మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
News February 27, 2026
విశాఖ: లారీ డ్రైవర్ ఆత్మహత్య

తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లారీతో కంపెనీకి వచ్చిన విజ్జి అనే డ్రైవర్ అడ్మిన్ బిల్డింగ్ ఎదురుగా మైదానంలో లారీ ఆపి శుక్రవారం ఉదయం లారీ క్యాబిన్ తలుపుకి తాడు కట్టి ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 27, 2026
మాంసం వ్యర్థాల మాయాజాలం.. కాంట్రాక్టర్లకు జీవీఎంసీ చెక్

మాంసం వ్యర్థాల ద్వారా GVMCకు వచ్చే ఆదాయం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్న వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. రోజుకు 10-15 టన్నులు, ఆదివారం 30 టన్నుల వరకు వ్యర్థాల సేకరణ జరుగుతున్నట్టు నెల రోజుల సర్వేలో తేలింది. ఇవి కాపులుప్పాడకు తరలించాల్సి ఉండగా గోదావరి జిల్లాల చేపల చెరువులకు మళ్లుతున్నట్లు గుర్తించారు. ఇకపై వీటిని కాపులుప్పాడ డంపింగ్ యార్డులోనే టెండర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.


