News March 13, 2025

విశాఖ: సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 

image

విదేశాలలో చైనాకు సంబంధించిన ఫేక్ కంపెనీలలో పని చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎంతోమందిని మోసం చేసి డబ్బులు దోచుకున్న వ్యక్తి విశాఖ పోలీసులకు చిక్కాడు. అనకాపల్లికి చెందిన నిందితుడు చొప్పా ఉమా మహేశ్‌ను సైబర్ పోలీసులు బుధవారం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అనకాపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. దీని వెనుక ఉన్న ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Similar News

News October 28, 2025

విశాఖలో రేపు కూడా సెలవే: కలెక్టర్

image

మొంథా తుఫాను నేపథ్యంలో విశాఖ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు బుధవారం సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ తీవ్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. కాగా ఈరోజు వరకే సెలవులు ఇస్తూ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 28, 2025

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విశాఖ కలెక్టర్ పర్యటన

image

విశాఖలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యటించారు. కైలాసపురం, శాంతి నగర్, కస్తూరి నగర్, మాధవధార అంబేద్కర్ కాలనీలో కొండచరియలు ఇళ్లపై పడడంతో పరిస్థితిని సమీక్షించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న ఇల్లు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరివేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 28, 2025

విశాఖ: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా రేషన్

image

విశాఖ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా అంటే మంగళవారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు ముందస్తుగానే అందజేస్తున్నారు. ఇప్పటికే పాత డెయిరీ ఫారం ఆదర్శనగర్ ప్రాంతాల్లో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్టాక్ అంతా ఇప్పటికే రేషన్ షాపులకు చేరుకుంది.