News March 1, 2025

విశాఖ: సోదరి ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మహిళ మృతి

image

విశాఖ సెంట్రల్ జైల్ సమీపంలో ఎస్ఎస్ఎ నగర్ ఎదురుగా బిఆర్ఎస్ రోడ్డులో స్కార్పియో వాహనం ఢీకొని గెడ్డం సావిత్రి(62) అనే మహిళ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు దాటుతుండగా సెంటర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలు ఆనందపురం గ్రామం కాగా స్థానికంగా ఉన్న సోదరి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలిపారు.

Similar News

News March 21, 2025

విశాఖలో ఆశీల వసూళ్లకు బహిరంగ వేలం

image

జీవీఎంసీ జోన్ -3 పరిధిలో 2025-26 సంవత్సరానిగాను పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోన్-3వ జోనల్ కమిషనర్ శివప్రసాద్ గురువారం తెలిపారు. జోన్-3లో మార్కెట్లు, లుంబిని పార్క్ ప్రవేశానికి, పార్కింగ్ టికెట్ వసూలు చేసేందుకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆశీలుమెట్ట జీవీఎంసీ జోన్ -3 జోనల్ కార్యాలయంలోని హాజరు కావాలన్నారు.

News March 20, 2025

విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: మంత్రి దుర్గేశ్‌

image

విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విశాఖపట్నంలో సినీపరిశ్రమ అభివృద్ది, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధిపై మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

News March 20, 2025

విశాఖలో పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీలో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు నారా లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేనలో గురువారం చేరారు. పార్టీ మారిన వారిలో 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత, 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజిని, 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ ఉన్నారు.

error: Content is protected !!