News September 28, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్లో 4వేల మందిని తొలగిస్తారా.?: అయోధ్యరాం

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒకేసారి 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిందని స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన తెలియజేయడంతో యాజమాన్యం దిగివచ్చిందన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టామన్నారు.
Similar News
News December 1, 2025
పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్

సింహాచలం దేవస్థాన పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని నిర్వసితులు డిమాండ్ చేశారు. ఆదివారం సింహాచలంలో నిర్వసితులు ధర్నా నిర్వహించారు. పంచగ్రామాల సమస్య హైకోర్టులో కేసు ఉందన్న కారణంతో ప్రభుత్వాలు ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించడంలేదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీల కోసం వందల ఎకరాల దేవస్థానం భూములను కట్టబెడుతున్నారని, పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కనీసం చర్చించడం లేదని మండిపడ్డారు.
News November 30, 2025
రాజ్యాంగ రక్షణకు సైన్యం కావాలి: పరకాల ప్రభాకర్

భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవడానికి దళిత, బహుజన సైన్యం ఏర్పడాలని ప్రముఖ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. విశాఖలో అంబేద్కర్ భవన్లో ఆదివారం “భారతదేశ రాజకీయాలు- రాజ్యాంగ నైతికత సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ రాజధానిలో ఊర కుక్కలపై ఉన్న స్పందన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుతో దాడికి స్పందన రాకపోవటం విచారకరమన్నారు. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమేనన్నారు.
News November 30, 2025
విశాఖ: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్’

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నవంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


