News September 26, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణ కమిటీ

విశాఖ <<14184296>>స్టీల్ ప్లాంట్<<>>లో ఈనెల 24న జరిగిన ప్రమాదంపై యజమాన్యం ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. పీపీఎం విభాగాధిపతి శంకర్ జీ, ఎస్ఎంఎస్-1కు చెందిన ఆర్పీ సింగ్, ఎస్ఎంఎస్-2 నుంచి శశికాంత్, సేఫ్టీ విభాగం నుంచి ఎం.వరప్రసాద్, క్యూఏ విభాగానికి చెందిన అప్పారావుతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 28 నాటికి కమిటీ నివేదిక అందజేయాలని ప్లాంట్ సీసీఎం ఆర్.మహంతి కోరారు.
Similar News
News November 4, 2025
విశాఖ: మనస్తాపంతో CA విద్యార్థి ఆత్మహత్య

సీఏ చదువుతున్న విద్యార్థి విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ ఎర్రంనాయుడి వివరాల ప్రకారం.. CA విద్యార్థి అఖిల్ వెంకట వంశీ ఆరిలోవలో నివాసం ఉంటున్నాడు. అన్ని పరీక్షలు పాస్ అయినట్లు ఇంట్లో అబద్దం చెప్పినందుకు మనస్తాపం చెందాడు. దీంతో పరీక్షల నిమిత్తం కొబ్బరి తోటలో తీసుకున్న రూమ్ వద్దే మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
News November 4, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో పలు చోట్ల కంపించిన భూమి
➤ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➤ మార్గశిర మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
➤ కంచరపాలెంలో నవంబర్ 7న జాబ్ మేళా
➤ శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి రైళ్లు: కేంద్ర మంత్రి
➤ కార్తీక పౌర్ణమి బీచ్ స్నానాలపై మెరైన్ పోలీసులు విజ్ఞప్తి
➤ విశాఖలో బహిరంగ మద్యపానంపై డ్రోన్తో నిఘా
News November 4, 2025
కేజీహెచ్లో హీమోడయాలసిస్ యంత్రాల ఏర్పాటు

కేజీహెచ్లోని ఎస్ఎస్ బ్లాక్ నెఫ్రాలజీ వార్డులో 9 హీమోడయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఓ కంపెనీ CSR నిధుల నుంచి రూ.2 కోట్లతో ఈ యంత్రాలను కేజీహెచ్కు అందించింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బుధవారం నుంచి వీటిని అందుబాటులోకి తేనున్నారు.


