News March 18, 2025
విశాఖ స్టేడియంలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్

విశాఖ నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్తో జరగనున్న మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఇవాళ ఆ టీమ్ సారథి అక్షర్ పటేల్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది విశాఖలో జరగనున్న ఈ తొలి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Similar News
News July 8, 2025
పరీక్షల నిర్వహణ పటిష్టంగా ఉండాలి: ఏయూ వీసీ

విద్యలో నాణ్యతను పెంచే దిశగా అనుబంధ కళాశాలలు పనిచేయాలని ఏయూ వీసీ జిపి రాజశేఖర్ అన్నారు. సోమవారం ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. పరీక్షలు నిర్వహణ పటిష్టంగా జరపాలని, లేకపోతే ఏయూ అనుబంధ కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొన్ని లోపాలు గుర్తించామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News July 8, 2025
గిరి ప్రదక్షిణ భక్తులకు హెల్ప్ లైన్ నంబర్లు

జూలై 9న జరగబోయే గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. 32 కి.మీలు ప్రదక్షిణలో జీవీఎంసీ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని, భక్తులకు సమస్యలు ఎదురైతే జీవీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 0891-2507225, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009లకు కాల్ చేయాలన్నారు.
News July 8, 2025
సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు

సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు సిద్ధంగా వున్నాయి. RK బీచ్ నుంచి భీమిలి వరకు సైట్ సీయింగ్ కోసం పర్యాటక శాఖ ఈ బస్సులను త్వరలోనే ప్రవేశ పెట్టనుంది. బీచ్ అందాలను డబుల్ డెక్కర్ నుంచి వీక్షించడానికి వైజాగ్ వాసులు ఎదురు చూస్తున్నారు. పర్యాటకంగా విశాఖకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.