News October 2, 2024
విశాఖ: హైకోర్టు ఆదేశాలతో రేషన్ డిపోల పునర్విభజనకు బ్రేక్

విశాఖ జిల్లాలో రేషన్ డిపోల పునర్విభజనకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. జిల్లాలో రేషన్ షాపుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీవోను రద్దు చేయాలని రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు విశాఖ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పద్మనాభం తెలిపారు.
Similar News
News February 28, 2026
విశాఖ మీదుగా రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్లు

ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-కొల్లాం (18501) మంగళవారాల్లో, చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్ (17065) మంగళవారాల్లో నడుస్తాయి. ఇవి విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయి. త్వరలోనే వీటి ప్రారంభ తేదీలను వెల్లడిస్తామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ తెలిపారు.
News February 28, 2026
శంకుస్థాపలు సరే.. శిలఫలకాలు వేయరేం: ఎమ్మెల్యే

జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. శంకుస్థాపనల అనంతరం శిలాఫలకాలు ఏర్పాటు చేయడం లేదని దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజు ఎంతమంది పారిశుధ్య కార్మికులు హాజరవుతున్నారు? ఏ పనులు చేస్తున్నారనే అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. 15 సంవత్సరాలుగా ఒకే వార్డులో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను మార్చాలని డిమాండ్ చేశారు.
News February 28, 2026
విశాఖలో నేటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్

విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ‘టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (TCCL) ప్రారంభం కానుంది. సినీ నటులు శ్రీకాంత్, తరుణ్ నేతృత్వంలో సుమారు 110 మంది సినీ, టీవీ ప్రముఖులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. పేద విద్యార్థుల చదువులకు చేయూతనిచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.


