News September 2, 2024
విశాఖ: 10న రాస్తారోకో

విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహరావు తెలిపారు. విశాఖ సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు. ఫలితంగా ఉత్పత్తి 73 లక్షల నుంచి 45 లక్షలకు పడిపోయిందన్నారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపిస్తున్నారన్నారు.
Similar News
News October 16, 2025
విశాఖలో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే.. నిషేధం ఎక్కడా?

GVMC పరిధిలో పాలిథిన్ వినియోగం ఆగడం లేదు. ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించినా.. అమలు మాత్రం జరగడం లేదు. మార్కెట్లు, కిరాణా షాపులు, కూరగాయల సంతలు ఇలా ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లు సులభంగా దొరుకుతున్నాయి. GVMC అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేధం కేవలం ప్రకటనలకే అంకితమైందని పలువురు విమర్శిస్తున్నారు. కాలుష్యం పెరిగి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోతున్నా చర్యలు లేవని మండిపడుతున్నారు.
News October 16, 2025
వందేళ్ల ప్రస్థానం: ఆంధ్రా వర్సిటీ వైభవం

ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయూ) ఒక విజ్ఞాన ఖని. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో నాణ్యమైన విద్యను ఏయూ అందిస్తోంది. మెరైన్, బయాలజీ వంటి ప్రత్యేక కోర్సులకు నిలయం. వెంకయ్య నాయుడు, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహులు ఇక్కడి పూర్వ విద్యార్థులే. శతాబ్ద కాలంగా ఈ విజ్ఞాన ఖని బాధ్యతగల పౌరులను, నాయకులను తీర్చిదిద్దుతూ ఆంధ్రుల గర్వకారణంగా నిలుస్తోంది.
News October 16, 2025
విశాఖ: ‘పవన్ కళ్యాణ్ను కలిసేదాకా ఊరెళ్లను’

బెట్టింగ్ యాప్ల వల్ల తనలా ఎవరూ నష్టపోకూడదని సాయి కుమార్ అనే యువకుడు పాదయాత్ర చేస్తూ విశాఖ నుంచి మంగళగిరి జనసేన ఆఫీసుకు వెళ్లాడు. బెట్టింగ్ యాప్ల వలలో పడి రూ.20 లక్షలు నష్టపోయానని తెలిపాడు. మరొకరు ఇలా నష్టపోకూడదని అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ యాప్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసు ముందు నిరసనకు దిగారు. పవన్ను నేరుగా కలిసి విన్నవించాకనే వెళ్తానంటున్నాడు.