News September 19, 2024
విశాఖ: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?
ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన అన్ని సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు MLAలు ప్రజలకు వివరించనున్నారు. పెన్షన్ పెంపు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలనలో, మీ MLA పనితీరుపై మీ కామెంట్..
Similar News
News September 20, 2024
విశాఖ: యార్లగడ్డ సహాయం కోరిన అమెరికా అధ్యక్ష అభ్యర్థి
మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ను అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సహాయ సహకారాలను అందించాలంటూ పిలుపు వచ్చింది. అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న అమెరికా తొలి మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ కోరారు. ఈ మేరకు వారిద్దరూ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్కు ఈమెయిల్ సందేశాలు వంపినట్లు లక్ష్మీ ప్రసాద్ కార్యదర్శి ఎస్.బాబయ్య తెలిపారు.
News September 20, 2024
వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
News September 19, 2024
సింహాచలం ఈవోగా వి.త్రినాథరావు
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానమునకు కార్యనిర్వహణ అధికారిగా వి.త్రినాథరావును నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్వర్వుల జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈవోగా పని చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తన మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో త్రినాథరావు వచ్చారు.