News October 28, 2024
విశాఖ: 134 పరుగుల ఆధిక్యతలో హిమాచల్ ప్రదేశ్

విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో మూడవరోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ 150 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 478 పరుగులు చేసి 134 పరుగుల అధికంగా ఉంది. బౌలింగ్ బరిలోకి దిగిన ఆంధ్ర జట్టులో శశికాంత్ అద్భుతమైన బౌలింగ్తో హిమాచల్ ప్రదేశ్ పరుగులకు బ్రేకులు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సత్యనారాయణ రాజు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశారు.
Similar News
News November 14, 2025
అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
News November 14, 2025
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఆత్మీయ వీడ్కోలు

ఏయూ వేదికగా నిర్వహించిన సిఐఐ సమ్మెట్లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు లభించింది. శుక్రవారం ఉదయం చేరుకున్న ఆయనకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆయన వాయుమార్గంలో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు.
News November 14, 2025
లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించండి: DMHO

ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించాలని DMHO జగదీశ్వరరావు అన్నారు. తరచుగా మూత్ర విసర్జన, మానసిక స్థితిలో, కళ్ల దృష్టిలో మార్పు, బరువు తగ్గడం,బలహీనతగా ఉండటం, ఎక్కువగా దాహం కలగడం వంటి లక్షణాల ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గరలో ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకోవాలన్నారు.


