News March 23, 2024
విశాఖ: 24 నుంచి ఐపీఎల్ టికెట్లు విక్రయాలు

విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఈనెల 31, వచ్చేనెల 3న నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్లకు టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్ లైన్లో విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. 27 నుంచి పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ ఢిల్లీ క్యాపిటల్స్ వెబ్సైట్లో ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. పీఎం పాలెం స్టేడియం బి గ్రౌండ్, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో రెడీమ్ చేసుకోవచ్చునని చెప్పింది.
Similar News
News January 9, 2026
ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.
News January 9, 2026
ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.
News January 8, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుడి మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్లోని ఫ్రెండ్స్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.


