News June 23, 2024
విశాఖ: 24, 25 తేదీల్లో రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

పలాస-విజయనగరం లైన్లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 24న పలాస-విశాఖ-పలాస, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు 24న విశాఖ-బ్రహ్మపూర్, 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 24న విశాఖ-భువనేశ్వర్, 25న భువనేశ్వర్-విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశామన్నారు.
Similar News
News December 7, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చిన్నారావు తన బైక్పై ఇంటికి వెళుతుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఓ వాహనం ఢీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలిని పరిశీలించిన దువ్వాడ పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.
News December 7, 2025
విశాఖలో రాత్రి పరిశుభ్రతపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధర, డైమండ్ పార్క్, తదితర ప్రాంతాల్లో రాత్రి పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి బాధ్యతగా పని చేయాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం రాత్రి సానిటేషన్ కీలకమని, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల సమయానుసార సేకరణ తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.
News December 7, 2025
పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో వన్డే మ్యాచ్ విజయవంతం

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్కు నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ శంఖబ్రత భాగ్చి ఆధ్వర్యంలో స్టేడియం చుట్టుపక్కల భారీగా సిబ్బందిని మోహరించి, డ్రోన్లతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన నియంత్రణతో భద్రతను విజయవంతంగా నిర్వహించారు.


