News June 15, 2024

విశాఖ: 28న 100వ తపాలా డాక్ అదాలత్

image

తపాలా వినియోగదారుల సమస్యలు ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 28న విశాఖ నగరం ఎంవీపీ కాలనీలోని తపాలా శాఖ రీజినల్ కార్యాలయంలో 100వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ప్రసన్న రెడ్డి తెలిపారు. అల్లూరి, పార్వతీపురం, కోనసీమ, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తపాలా వినియోగదారులు సమస్యలను ఈనెల 21వ తేదీలోగా రీజినల్ కార్యాలయం చిరునామాకు అందజేయాలన్నారు.

Similar News

News October 14, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 120 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 120 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News October 13, 2025

సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

image

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహారం కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.

News October 13, 2025

ఆక్రమణకు గురౌతున్న ఏయూ భూములు..!

image

న‌గ‌రంపాలెంలోని ఏయూ 137 ఎకరాల భూమిని ఏయూ వీసీ జి.పి రాజ‌శేఖ‌ర్‌, రిజిస్ట్రార్ రాంబాబు సోమవారం పరిశీలించారు. కొంత భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురిఅవుతోంద‌ని, మ‌రికొంత స్థ‌లంలో అనధికార రహదారి నిర్మాణం జరుగుతుండటాన్ని గుర్తించారు. ఏయూ భూముల సరిహద్దులను త్వరగా నిర్ధారించాలన్నారు. భూమిని ప‌రిర‌క్షించే విధంగా అవ‌స‌ర‌మైన‌ చర్యలను స‌త్వ‌రం చేపట్టాలని వీసీ అధికారులకు ఆదేశించారు.