News January 8, 2025
విశాఖ: 600 బస్సుల్లో జనాల తరలింపు

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో బుధవారం నిర్వహించే బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ 600 బస్సులను వినియోగిస్తుంది. విశాఖ నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సుల ద్వారా ప్రజలను తరలించనున్నారు. అలాగే దూర ప్రాంతాలకు 60 బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నేడు ఆర్టీసీ సిటీ, మెట్రో సర్వీసులు దాదాపు నిలిచిపోనున్నాయి.
Similar News
News December 18, 2025
విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు: కలెక్టర్

విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, కాలుష్య కారకాలను గుర్తించి వాటి తీవ్రత తగ్గించేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
News December 18, 2025
విశాఖ: స్టీల్ ప్లాంట్కు ఇన్ఛార్జ్ సీఎండీగా గుప్తా

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 18, 2025
విశాఖ: స్టీల్ ప్లాంట్కు ఇన్ఛార్జ్ సీఎండీగా గుప్తా

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


