News April 17, 2025

విశాఖ: POCSO చట్టంపై అవగాహనా కల్పించిన హోం మంత్రి

image

వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో మహిళల రక్షణ, POCSO చట్టంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ప్రేమ ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రులు కోసం ఒక్క క్షణం ఆలోచించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. CP శంకబ్రాత బాగ్చి ఉన్నారు.

Similar News

News April 20, 2025

గాజువాకలో బెట్టింగ్ ముఠా అరెస్ట్ 

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో బెట్టింగ్ ముఠాను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పరిధిలో బీహెచ్‌పీవీ వద్ద బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతుందో ఆరా తీస్తున్నారు. కమిషనర్ ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ఈ దాడులు చేసింది.

News April 20, 2025

విశాఖ: ఒంటరితనం భరించలేక సూసైడ్

image

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.

News April 20, 2025

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖ నగర ప్రజలు లా అండ్ ఆర్డర్,క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్యలు,పలు పోలీస్ సంబంధిత సమస్యలపై రేపు ఉదయం 10 గంటల నుంచి వినతులు సమర్పించవచ్చన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అయితే అంబేడ్క‌ర్ జయంతి కారణంగా గత సోమవారం పీజిఆర్ఎస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!