News March 1, 2025
విశ్వామిత్రను అభినందించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్

అతి చిన్న వయసులోనే సామాజిక స్పృహ కలిగి ఉండడంపై వెల్డన్ బేటా అంటూ మొక్కల ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్ను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అభినందించారు. వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్తో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని చేస్తున్న ప్రయత్నాన్ని కలెక్టర్ మెచ్చుకున్నారు. వరుసగా అవార్డులు అందుకోవడంతో అభినందించారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకోవడం గర్వంగా ఉందన్నారు.
Similar News
News December 2, 2025
జనగామ: 3 వార్డులకు ఎన్నికలు లేవు!

తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పత్రాల పరిశీలన కొనసాగుతోంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో 3 వార్డులకు రిజర్వేషన్ల కారణంగా నామినేషన్లు దాఖలు కాలేదు. జనగామ జిల్లాలో రెండో విడతలో కూడా 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కానట్లు తెలుస్తోంది. మొత్తంగా 10 వార్డుల వరకు నామినేషన్లు రాలేదని సమాచారం.
News December 2, 2025
ఆ ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ

AP: బీఈడీ క్వాలిఫికేషన్తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
News December 2, 2025
VKB: పంచాయతీ బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో..?

వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ‘పంచాయతీ’ వేడెక్కింది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం నేతలకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా ఒక్కరినే బరిలో దించేందుకు, నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు బుజ్జగిస్తున్నారు. రేపటితో తొలివిడత బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో తేలనుంది.


