News June 28, 2024

విషమంగా మోతిలాల్ నాయక్ ఆరోగ్యం

image

గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ ఆరోగ్య పరిస్థితిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ఐదు రోజుల క్రితం మోతిలాల్ నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. పలువురు ప్రముఖులు మోతిలాల్‌కు ఇప్పటికే మద్దతు తెలిపారు. కాగా గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలని మోతీలాల్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

NLG: యాసంగికి ఢోకా లేదు..!

image

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్‌కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్‌ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

News November 18, 2025

NLG: యాసంగికి ఢోకా లేదు..!

image

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్‌కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్‌ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

News November 18, 2025

నేడు జలశక్తి మిషన్ అవార్డు ప్రదానం

image

జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును కేంద్ర జలశక్తి మిషన్ ఈనెల 18న ఢిల్లీలో ఇవ్వనుంది. జిల్లాకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం అందజేయనుంది. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు 84,827 పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డును అందుకునేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.