News February 26, 2025

విషాదం.. ఏడ్రోజుల బాలింత మృతి

image

రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. శివారెడ్డి భార్య పవిత్ర (32) ఏడు రోజుల బాలింత లివర్ ఇన్ఫెక్షన్‌తో మృతి చెందారు. ఆమె వారం రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌తో ఆమె బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు వైద్యుల సూచనలు మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News November 15, 2025

ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొంటాం: మంత్రి మండిపల్లి

image

APSRTCని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఇకపై డీజిల్ బస్సులను కొనబోమని, రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్త్రీ శక్తి పథకం బాగా నడుస్తోందని, దీనిపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు మౌనం వహించారని ఎద్దేవా చేశారు.

News November 15, 2025

39,506 మారుతీ గ్రాండ్ విటారా కార్లు వెనక్కి

image

సాంకేతిక సమస్యలు తలెత్తిన గ్రాండ్ విటారా మోడల్ కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2024 DEC 9 నుంచి 2025 APR 29 వరకు తయారైన 39,506 కార్లలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సిస్టమ్‌లో లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఆథరైజ్డ్ డీలర్ వర్క్‌షాప్స్‌లో ఆ కార్లను పరీక్షించి లోపాలున్న పరికరాలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది.

News November 15, 2025

ప.గో జడ్పీ కార్యాలయంలో 14 మందికి ప్రమోషన్స్

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న 14 మంది దిగువ శ్రేణి సిబ్బందికి పదోన్నతి కల్పిస్తూ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ శనివారం ఉత్తర్వులు అందజేశారు. జిల్లా పరిషత్ యాజమాన్యం తమ శ్రమను గుర్తించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమర్థవంతంగా పనిచేయాలని పద్మశ్రీ సూచించారు.