News May 12, 2024

విషాదం.. గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చిలకలపాడు నుంచి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి కాలినడకన వస్తుండగా.. గౌతమి గోదావరిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకలపాడుకు చెందిన మహిళలుగా స్థానికులు గుర్తించారు.

Similar News

News February 28, 2026

ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ: ఎంపీ

image

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (సెర్వికల్‌ క్యాన్సర్‌) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.

News February 28, 2026

ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ: ఎంపీ

image

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (సెర్వికల్‌ క్యాన్సర్‌) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.

News February 27, 2026

తూ.గో: కల్తీ పాల ఘటనపై హెల్త్ బులెటిన్ విడుదల

image

కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.