News September 2, 2024

విషాదం.. పంట మునిగిందని రైతు ఆత్మహత్యాయత్నం

image

వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలకూ కష్టాలు తప్పడం లేదు. ఈక్రమంలో ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాజుపాలెం మండలం అనుపాలేనికి చెందిన పగిల్ల గోపి కౌలుకు తీసుకుని మూడెకరాల్లో పైరు సాగు చేశారు. వరద నీటిలో పంట మునిగిపోయింది. దీనికి తోడు పాత అప్పులు ఉండటంతో బాధ తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Similar News

News October 14, 2025

యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

image

రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

News October 14, 2025

తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

image

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.

News October 14, 2025

GNT: సైబర్ నేరాలకు పాల్పడుతున్న వంటమాస్టర్ అరెస్ట్ !

image

గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన రైస్ మిల్లు యజమాని వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ. కోటి కొల్లగొట్టిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొల్లుకు చెందిన నిందితుడు ఇంటర్ చదివి బెంగుళూరులో వంటమాస్టర్‌గా పనిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అలా కొల్లగొట్టిన డబ్బును అతని స్నేహితులు ఖాతాలకు మళ్లించడంతో పాటూ క్రికెట్ బెట్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.