News January 27, 2025
విషాదం.. వాటర్ వ్యాన్ కింద పడి బాలుడి మృతి

తలుపుల మండల పరిధిలోని పెద్దనాన్నపల్లిలో ఆదివారం సాయంత్రం ఫిల్టర్ వాటర్ సరఫరా చేసే వ్యాన్ కిందపడి మోక్షిత్ శ్రీరామ్(3) మృతి చెందాడు. తలుపుల ఎస్ఐ నరసింహుడు తెలిపిన వివరాల మేరకు.. బాలుడు వీధిలో ఉండగా శుద్ధ జలాలు సరఫరా చేసే వ్యాన్ వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 26, 2025
పదవ తరగతి పరీక్ష ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు: డీఈవో

పదవ తరగతి పరీక్ష ఫీజును ఆన్లైన్ సేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని పల్నాడు డీఈవో చంద్రకళ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి పదవ తేదీ వరకు ఫైన్ లేకుండా చెల్లించవచ్చన్నారు. ఆ తర్వాత 15వ తేదీ వరకు ఫైన్తో చెల్లించవచ్చన్నారు. ఎస్ ఎస్ సి వెబ్సైట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్ గేట్ వే ద్వారా కూడా పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈవో తెలియజేశారు.
News November 26, 2025
కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.
News November 26, 2025
తుదిదశకు రోడ్ల వెడల్పు శిథిలాల తొలగింపు

వేములవాడ పట్టణంలో రోడ్ల వెడల్పుకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రూ.42 కోట్ల అంచనా వ్యయంతో పట్టణంలోని మెయిన్ రోడ్డును 80 అడుగుల మేరకు విస్తరిస్తున్నారు. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా సుమారు 180 ఇండ్లను తొలగించారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన కూల్చివేతలు తిరిగి ప్రారంభం కాగా వాటికి సంబంధించిన శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు.


