News March 3, 2025

విషాద ఘటనపై మంత్రి పయ్యావుల దిగ్భ్రాంతి

image

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తన మనసును కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. కాగా ఈ విషాద ఘటనలో ముగ్గరు అక్కాచెల్లెళ్లు, మూడు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే.

Similar News

News March 25, 2025

MMTS ఘటన.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాల

image

హైదరాబాద్‌లోని MMTS <<15866506>>రైలు<<>> మహిళా కోచ్‌లో ఒంటరిగా ఉన్న అనంతపురం జిల్లా యువతి (23)పై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. యువకుడి వయసు 25ఏళ్లు ఉంటుందని అంచనాకు వచ్చిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News March 25, 2025

అనంత: పరిష్కార వేదికకు 63 పిటిషన్లు.!

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRC కార్యక్రమంలో 63 పిటీషన్లు వచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ స్వయంగా వారి సమస్యను విని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించి, వారి సమస్యను పరిష్కరించాలని పోలీసులకు ఆయన సూచించారు.

News March 24, 2025

అనంత: ఈతకు వెళ్లి 10th విద్యార్థి మృతి.!

image

అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని మొబ్బు కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

error: Content is protected !!