News December 20, 2024

విస్తుపోయేలా చేసిన మహిళ మర్డర్ స్కెచ్

image

డబ్బే లోకంగా మారిపోయిన రోజులివి. ఆస్తి, ఉద్యోగం దక్కితే చాలు.. తమ జీవితాలు ఇక స్థిరపడిపోతాయనే ఆలోచన బలంగా నాటుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. తల్లి, తండ్రి, అన్నాచెల్లి అనే పేగు బంధాలకు పాతర వేసి హంతకులవుతున్నారు. నకరికల్లులో జరిగిన <<14929205>>డబుల్ మర్డర్ <<>>కేసే ఇందుకు ఉదాహరణ. ఆస్తి, తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కోెసం అన్నదమ్ములను ప్రియుడితో కలిసి దారుణంగా చంపిన కృష్ణవేణి క్రూరమైన ఆలోచన మానవత్వానికే మాయని మచ్చ.

Similar News

News March 2, 2026

దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. చెట్టు ఎక్కిన బైక్!

image

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు గాయపడగా, వారి వాహనం వింతగా చెట్టుపైకి దూసుకెళ్లిన ఘటన దుగ్గిరాల లాకు వద్ద జరిగింది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తూ పడిపోగా, బైక్ మాత్రం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 2, 2026

తుళ్లూరులో కొడుకుని పట్టించిన పేరెంట్స్..!

image

తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఆవులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ మండల వ్యాప్తంగా సుమారు 25 ఆవులకు పైగా అపహరించినట్లు పలువురు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్టేషన్ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. తిరిగి కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పజెప్పగా సిబ్బంది పేరెంట్స్‌ను అభినందించారు.

News March 2, 2026

గుంటూరులో ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్

image

గుంటూరు కలెక్టరేట్ శంకర్ సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సోమవారం ప్రారంభమైంది. జేసీ శ్రీవాత్సవ, ఆర్డీఓ శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, వివాదాలకు సంబంధించిన అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్ వచ్చే సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు.