News June 6, 2024
‘విహార యాత్రను.. విషాద యాత్రగా మార్చొద్దు’

చీరాల సముద్ర తీరంలో స్నానం ఆచరించడానికి వచ్చిన యాత్రికులకు బుధవారం రూరల్ ఎస్సై శివ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విహార యాత్రను విషాద యాత్రగా మార్చవద్దని కోరారు. అందరూ సంయమనం పాటించాలని.. అధిక లోతుకు పోయి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని ఆయన సూచించారు. బీచ్కు వచ్చే వారు అధికారుల సూచనలు పాటించాలన్నారు.
Similar News
News December 23, 2025
గిద్దలూరులో షాకింగ్ ఘటన.. పోక్సో కేసు నమోదు!

గిద్దలూరులో బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న బాలికను బెదిరించి స్కూల్ నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో టి. వెంకటేశ్వర రెడ్డిపై గిద్దలూరు పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. దీంతో గిద్దలూరు టౌన్ సీఐ సురేశ్ దర్యాప్తు చేస్తున్నారు.
News December 23, 2025
గంజాయి నిర్మూలనే టార్గెట్: ప్రకాశం ఎస్పీ

జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా స్పెషల్ టీం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో సెప్టెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 6 గంజాయి కేసులలో 25 మంది వద్ద 9.87 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రైళ్లలో తనిఖీలు నిర్వహించి 12 మందిని అరెస్టు చేసి 72 కిలోలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
News December 23, 2025
గిఫ్ట్ అని క్లిక్ చేస్తే.. అంతా ఫట్: ప్రకాశం పోలీస్ హెచ్చరిక

వాట్సాప్లకు గిఫ్టుల పేరిట వచ్చే ఏపీకె ఫైల్స్ను క్లిక్ చేయవద్దని పోలీసులు మంగళవారం కీలక సూచన చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గిఫ్ట్ పేరిట వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు పంపించే వీటిని క్లిక్ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు.


