News June 30, 2024
వీఎస్యూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా సునీత
నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్గా పనిచేసిన రామచంద్రారెడ్డి రెండేళ్ల పదవీ కాలం నిన్నటితో ముగిసింది. దీంతో ఆయన కడపలోని యోగి వేమన యూనివర్సిటీకి వెళ్లారు. దీంతో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా కె.సునీత యూనివర్సిటీ పరిపాలనా భవనంలో శనివారం భాధ్యతలు స్వీకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సునీతను సన్మానించారు.
Similar News
News September 30, 2024
నెల్లూరులో రైలు ఢీకొని మహిళ మృతి
నెల్లూరు రైల్వే స్టేషన్లో ఆదివారం రాత్రి గూడ్స్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన రైల్వే పోలీసుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 30, 2024
నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్
సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 29, 2024
గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు
గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.