News April 1, 2025
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న MHBD కలెక్టర్

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్ కుమార్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యువత సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News September 14, 2025
ఆ రైలు నరసాపురం వరకు పొడిగించండి: RRR

చెన్నై-విజయవాడ వందేభారత్ రైలు నరసాపురం వరకు పొడిగించాలని శాసనసభ ఉపసభాపతి రఘురామ కేంద్ర రైల్వే కమిటీకి తాజాగా లేఖ రాశారు. భీమవరం మీదుగా నరసాపురం వరకు ఈ రైలు పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి అనకాపల్లి ఎంపీ, రైల్వే కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ సానుకూలంగా స్పందించారని రఘురామ వెల్లడించారు.
News September 14, 2025
NLG: దసరాకు స్పెషల్ బస్సులు

దసరా పండుగను పురస్కరించుకుని నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 705 స్పెషల్ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నారు. ఈ మేరకు రీజియన్ రూపొందించిన నివేదికను ఆర్టీసీ సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు. దేవరకొండ డిపో పరిధిలో 131 బస్ సర్వీసులు, కోదాడలో 94, MLG 115, నల్గొండ 89, NKP 36, SRPT 144, యాదగిరిగుట్ట పరిధిలో 96 బస్ సర్వీసులు నడపనున్నారు.
News September 14, 2025
ములుగు జిల్లాలో 422మి.మీ భారీ వర్షపాతం నమోదు

ములుగు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో 422మి.మీ వాన పడింది. సగటు వర్షపాతం 46.8మి.మీగా నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. వెంకటాపురంలో 130.2, వాజేడులో 43.6, మంగపేటలో 24.2, వెంకటాపూర్ లో 34.2, ములుగులో 17.2, గోవిందరావుపేటలో 23.6, తాడ్వాయిలో 23.6, ఏటూరునాగారంలో 61.6, కన్నాయి గూడెంలో 63.8మి. మీ వర్షం కురిసింది.