News March 8, 2025
వీణవంక: బస్సులోనే గుండెపోటుతో మృతి

జమ్మికుంట-కరీంనగర్ వెళ్తున్న బస్సులో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు అనే వ్యక్తి బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సులోనే గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ చేరుకున్న అనంతరం బస్సు కండక్టర్ ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడు కరీంనగర్ ICICI బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు.
Similar News
News November 17, 2025
శివ పూజలో తులసిని వాడుతున్నారా?

శివుడికి సంబంధించి ఏ పూజలు నిర్వహించినా అందులో మాల, తీర్థం ఏ రూపంలోనూ తులసిని వినియోగించకూడదనే నియమం ఉంది. శివ పురాణం ప్రకారం.. తులసి వృంద అనే పతివ్రతకు ప్రతిరూపం. ఆమె భర్త జలంధరుడిని శివుడు సంహరించాడు. అప్పుడు శివుడి పూజలో తన పవిత్ర రూపమైన తులసిని వాడరని శాపమిచ్చింది. అందుకే శివుడికి బిల్వపత్రాలు ప్రీతిపాత్రమైనవి. గణపతి పూజలోనూ తులసిని ఉపయోగించరు.
News November 17, 2025
iBomma ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా?

ఇమ్మడి రవి అరెస్టుతో iBomma, బప్పం టీవీ <<18302048>>బ్లాక్ <<>>అయిన విషయం తెలిసిందే. అయితే అవి ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అనే చర్చ నెట్టింట మొదలైంది. iBommaకు ముందు ఎన్నో పైరసీ సైట్లు ఉన్నాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. వాటిపైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఐబొమ్మ ప్లేస్లోకి అవి వస్తాయంటున్నారు. డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని పేర్కొంటున్నారు. మీరేమంటారు?
News November 17, 2025
Wow.. సిద్దిపేట నుంచి ఇండియా టీంకు

అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.


