News April 9, 2025
వీణవంక: వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ముద్దసాని!

కమలాపూర్ నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చేది ముద్దసాని దామోదర్ రెడ్డి అని చెప్పవచ్చు. 1985, 1989, 1994, 1999లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా 4సార్లు MLAగా విజయం సాధించాడు. 29 ఏళ్లకే MLAగా, 30ఏళ్లకు మంత్రిగా నియోజకవర్గానికి సేవలందించాడు. వీణవంక(M) మామిడాలపల్లి గ్రామానికి చెందిన దామోదర్రెడ్డి 2012 ఏప్రిల్ 9న అనారోగ్యంతో మృతిచెందాడు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయన సేవలు గుర్తుచేసుకుంటున్నారు.
Similar News
News November 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత
∆} పాలేరు, ఖమ్మంలో కల్వకుంట్ల కవిత పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట BRS నిరసన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత
∆} పాలేరు, ఖమ్మంలో కల్వకుంట్ల కవిత పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట BRS నిరసన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 18, 2025
ఖమ్మం: కొనుగోళ్ల నిలిపివేత.. రైతులు పత్తి తీసుకురావద్దు

సీసీఐ (CCI) జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో అమలు చేస్తున్న L1, L2 పద్ధతికి వ్యతిరేకంగా మిల్లుల యాజమాన్యాలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభించాయి. ఈ కారణంగా జిన్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని ఖమ్మం అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులందరూ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు.


