News April 9, 2025

వీణవంక: వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ముద్దసాని!

image

కమలాపూర్ నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చేది ముద్దసాని దామోదర్ రెడ్డి అని చెప్పవచ్చు. 1985, 1989, 1994, 1999లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా 4సార్లు MLAగా విజయం సాధించాడు. 29 ఏళ్లకే MLAగా, 30ఏళ్లకు మంత్రిగా నియోజకవర్గానికి సేవలందించాడు. వీణవంక(M) మామిడాలపల్లి గ్రామానికి చెందిన దామోదర్‌రెడ్డి 2012 ఏప్రిల్‌ 9న అనారోగ్యంతో మృతిచెందాడు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయన సేవలు గుర్తుచేసుకుంటున్నారు.

Similar News

News November 23, 2025

ఉమ్మడి నల్గొండలో ‘బడుగు’లకే పట్టం

image

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల ఎంపికలో అధిష్ఠానం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చింది. జిల్లాలోని మూడు అధ్యక్ష పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాలకే పెద్దపీట వేసింది. నల్గొండ, భువనగిరి జిల్లాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించగా, సూర్యాపేట జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎస్సీ సమాజానికి చెందిన నాయకుడికి అప్పగించింది. ఈ నిర్ణయం ద్వారా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

News November 23, 2025

ఖమ్మం: సామాన్య కార్యకర్త నుంచి జిల్లా సారథిగా..

image

ఖమ్మంకాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వైరా నేత నూతి సత్యనారాయణ గౌడ్ రాజకీయ ప్రస్థానం దశాబ్దాల నాటిది. గతంలో ఆయన NSUI, యూత్ కాంగ్రెస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పార్టీని పటిష్ఠం చేయడంలో, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని ఏకం చేయడంలో ఆయన నియామకం కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

News November 23, 2025

పొంచి ఉన్న తుఫాను ముప్పు.. రైతుల ఆందోళన

image

AP: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిర్చి తోటలు, రబీ పంటలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. వెంటనే ధాన్యాన్ని కుప్పలు వేసి, టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని అధికారులు సూచించారు.