News February 13, 2025

వీరఘట్టం: అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య

image

అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీరఘట్టంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మణరావు(38) కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో గడ్డిమందు తాగాడు. గుర్తించిన భార్య చోడవరపుదేవి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News September 17, 2025

PDPL: ‘సమాజం బలంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి’

image

సమాజం బలంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యంగా, ఆత్మ విశ్వాసంతో ఉండాలని పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జరిగిన స్వస్తి నారి- సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో MP పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

News September 17, 2025

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2025

కొడంగల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

కొడంగల్ నియోజకవర్గ తుంకిమెట్ల శివారులో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దౌల్తాబాద్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన కనకప్ప (26) అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పని చేసే కనకప్ప రాత్రి స్వగ్రామానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అన్న ఆశప్ప ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.