News February 13, 2025

వీరఘట్టం: అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య

image

అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీరఘట్టంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మణరావు(38) కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో గడ్డిమందు తాగాడు. గుర్తించిన భార్య చోడవరపుదేవి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News March 25, 2025

ఒంగోలు: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

image

ఏపీపీఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏపీపీఎస్‌సీ ప‌రీక్ష‌ జరుగుతున్న ఒంగోలులోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్, సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

News March 25, 2025

50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు: కూనంనేని

image

TG: అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులవుతున్నారని ఆయన అన్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రమ, మేధ దోపిడీ ఇక్కడే జరుగుతోందని పేర్కొన్నారు. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా, పగలు, రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు.

News March 25, 2025

ఆదిలాబాద్: బాధిత కుటుంబానికి రూ.8 లక్షల చెక్కు

image

గత సంవత్సరం తాంసి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ గంగన్న కుటుంబానికి ప్రభుత్వపరంగా వచ్చే అన్ని సహాయ సహకారాలు సకాలంలో అందజేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందిని ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ గంగన్న భార్య ప్రమీలకు మంగళవారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.8 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

error: Content is protected !!